హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్

by Disha Web Desk 19 |
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్
X

దిశ, గండిపేట్: మితిమీరిన వేగంతో లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్‌గా ఉండగా.. మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం ఓ కారు శంకరపల్లి నుండి హైదరాబాద్ వస్తుండగా ఖానాపూర్ పోచమ్మ టెంపుల్ సమీపంలో ఇసుక లారీని ఓవర్టేక్ చేయబోయి లారీని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ప్రమాదం సమయంలో కారులో 10 మంది ప్రయాణిస్తుండగా.. ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన యువకులను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన ఏడుగురిని ప్రీమియర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed